టీజర్‌ ఆసక్తికరంగా ఉంది

30 Nov, 2023 02:48 IST|Sakshi

– ‘దిల్‌’ రాజు

సంబీత్‌ ఆచార్య, జో శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎమ్‌4ఎమ్‌’. నిర్మాత మోహన్‌ వడ్లపట్ల ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. మోహన్‌ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్‌ గ్రూప్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తాను. నెక్ట్స్‌ హాలీవుడ్‌లోనూ ఓ సినిమాను నిర్మించబోతున్నాను. రాహుల్‌ అడబాల, జో శర్మలు ఈ చిత్రకథ రాయడంలో సహకరించారు’’ అన్నారు మోహన్‌ వడ్లపట్ల. ఎంఆర్‌సీ చౌదరి, రాహుల్‌ అడబాల మాట్లాడారు.

మరిన్ని వార్తలు