Ek Villain 2 First Look Posters: 'ఏక్‌ విలన్‌ 2'లో నటీనటుల ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్ విడుదల..

28 Jun, 2022 09:43 IST|Sakshi

Ek Villain 2 First Look Posters Of John Abraham Arjun Kapoor Out: బాలీవుడ్‌ ప్రముఖ దర్శకులలో మోహిత్ సూరి ఒకరు. ఆయన దర్శకత్వంలో శ్రద్ధా కపూర్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర, రితేష్ దేశ్‌ముఖ్‌ ప్రధాన తారగణంగా నటించిన చిత్రం 'ఏక్‌ విలన్‌'. 2014లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ సీక్వెల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సీక్వెల్‌లో ఎవరు నటించనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. 

ఈ సినిమాలో నటించే నటీనటులను దర్శకనిర్మాతలు కొన్నాళ్లుగా రహస్యంగా ఉంచగా, తాజాగా వారి పేర్లను బయటపెట్టారు. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత నిరీక్షణకు తెరదింపారు. 'ఏక్‌ విలన్‌'కు సీక్వెల్‌గా వస్తున్న 'ఏక్‌ విలన్‌: రిటర్న్స్‌' చిత్రంలో అర్జున్‌ కపూర్, జాన్‌ అబ్రహం, దిశా పటానీ, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను 'విలన్ల లోకంలో హీరోలకు చోటులేదు' అనే క్యాప్షన్‌తో విడుదల చేశారు. ​​యాక్షన్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి మోహిత్‌ సూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి: తల్లి కాబోతున్న స్టార్‌ హీరోయిన్
హార్ట్‌ సింబల్స్‌తో సమంత ట్వీట్‌.. నెట్టింట వీడియో వైరల్‌..

A post shared by John Abraham (@thejohnabraham)

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

A post shared by TARA💫 (@tarasutaria)

మరిన్ని వార్తలు