Keerthy Suresh: నన్ను చూసి అంతా టెన్షన్ పడ్డారు: కీర్తి సురేశ్‌

16 Apr, 2023 18:48 IST|Sakshi

నేచురల్ స్టార్‌ నాని, కీర్తి సురేశ్ జంటగా రీసెంట్‌ బ్లాక్ బస్టర్ మూవీ దసరా. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీలో కీర్తి, నాని నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు సైతం వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కీర్తి సురేశ్ పాత్రలో జీవించింది. అచ్చ తెలంగాణ యాసలో తన మాటలతో అభిమానులను కట్టిపడేసింది. ఈ చిత్రంలో తనకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం మరో విశేషం. 

అయితే తాజాగా కీర్తి సురేశ్‌ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో తనపాత్రకు తానే డబ్బింగ్ చెబుతూ కనిపించింది. ఈ సీన్‌ సినిమా నుంచి తొలగించినట్లు కీర్తి వెల్లడించింది. కీర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ..' దసరా మూవీలో తొలగించిన సీన్ ఇది. ఆ సీన్‌కు నేనే డబ్బింగ్ చెప్పా. డబ్బింగ్ చెబుతున్నప్పుడు నన్ను చూసి అంతా టెన్షన్ పడ్డారు. డబ్బింగ్ ఒక అద్భుతమైన కళ.' అంటూ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో కీర్తి సురేశ్ తెలుగు డబ్బింగ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అచ్చ తెలుగులో.. అది తెలంగాణ యాసలో డబ్బింగ్  చెప్పిన మహానటి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. 

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

>
మరిన్ని వార్తలు