`సూర్యాస్త‌మ‌యం` చేయడం గర్వంగా ఉంది

28 Aug, 2021 19:51 IST|Sakshi

ప్ర‌వీణ్ రెడ్డి, బండి స‌రోజ్‌, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన  చిత్రం `సూర్యాస్త‌మ‌యం`. శ్రీహార్‌సీన్ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై బండి స‌రోజ్ ద‌ర్శ‌క‌త్వంలో క్రాంతి కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. 

ఈ సందర్భంగా నిర్మాత  క్రాంతికుమార్ తోట మాట్లాడుతూ ‘ప‌దేళ్ల ముందు నిర్మాత‌గా చేసిన త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు సినిమా చేస్తున్నాను. `సూర్యాస్త‌మ‌యం` సినిమా చేయ‌డానికి చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను, అలాగే శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ కి  మంచి స్పందన వస్తుండటం చాలా ఆనందం గా వుంది, మా హీరో ప్రవీణ్ రెడ్డి కి నటన పరంగా మంచి ప్రశంసలు  అందుతున్నాయి. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను’అన్నాడు. ఈ మూవీ లో అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాను అన్నారు హీరో ప్రవీణ్‌ రెడ్డి.  ప్రొడ్యూసర్‌ రఘు మాట్లాడుతూ.. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనేది మరోసారి ‘సూర్యస్తమయం’తో నిజమైందని అన్నారు.

మరిన్ని వార్తలు