రింగా రింగా రోసే..

16 May, 2023 04:04 IST|Sakshi

కార్తీక్‌ రాజు, సిమ్రన్‌ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘అథర్వ’. మహేశ్‌ రెడ్డి దర్శకత్వంలో నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్‌ నూతలపాటి ఈ సినిమాను నిర్మించారు. త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్ర సంగీతదర్శకుడు శ్రీ చరణ్‌ పాకాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘రింగా రింగా రోసే.. పిల్లా నిన్నే చూసే.. చిట్టిగుండె కూసే..’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.

శ్రీ చరణ్‌ పాకాల బాణీఅందించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించగా, జావేద్‌ అలీ ఆలపించారు. మాస్టర్‌ రాజ్‌కృష్ణ కొరియోగ్రాఫర్‌. ఈ పాట విడుదల సందర్భంగా హీరో కార్తీక్‌ రాజు మాట్లాడుతూ– ‘‘రింగా రింగా రోసే..’ పాట అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘హీరో చిన్నతనం నుండి హీరోయిన్‌ను ప్రేమిస్తుంటాడు కానీ చెప్పలేకపోతాడు. చివరికి తన ఫీలింగ్‌ను ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేస్తాడు’’ అన్నారు మహేశ్‌రెడ్డి. ‘‘త్వరలోనే రిలీజ్‌ కానున్న మా సినిమాను ప్రేక్షకులు సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుభాష్‌. ‘‘ఈ చిత్రంలో  చాలా ఎమోషన్స్‌ ఉన్నాయి’’ అన్నారు సిమ్రన్‌ చౌదరి.

మరిన్ని వార్తలు