ప్రముఖ నటుడు శరత్ బాబు(71) మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. ఆయన మరణంపై శరత్బాబు చిన్ననాటి మిత్రులు స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'పూర్వం శరత్బాబుతో కలిసి నాటకాలు, నాటికలు వేసేవాళ్లం. ఆయన నాకు మంచి మిత్రుడు. ఈ రోజు నా స్నేహితుడిని కోల్పోవడం నిజంగా బాధాకరం. ఆయన మంచి నటుడని మేమే కాదు ప్రజలంతా చెప్తారు. అంతటి పేరు సంపాదించుకున్నాడు' అని చెప్పుకొచ్చాడు.
మరో స్నేహితుడు మాట్లాడుతూ.. 'నేను ఉపాధి కోసం తిరుగుతున్న సమయంలో శరత్బాబు ఫ్యామిలీ నాకు సాయం చేసింది. వారి వల్లే నేను సినీరంగంలో ప్రవేశించాను. 35 ఏళ్లు అదే రంగంలో ఉన్నాను. ఆయన తెలుగులో కన్నా తమిళంలో ఎక్కువగా పేరుప్రతిష్టలు సంపాదించారు' అంటూ శరత్ బాబును గుర్తు చేసుకున్నాడు.
చదవండి: రమాప్రభతో జరిగింది పెళ్లే కాదన్న శరత్బాబు.. ఆస్తులు రాసిచ్చినా కూడా