Satinder Kumar Khosla: బాలీవుడ్‌లో విషాదం.. షోలే నటుడు కన్నుమూత!

13 Sep, 2023 12:26 IST|Sakshi

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సతీందర్ కుమార్ ఖోస్లా(80) మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన ఉప్కార్, రోటీ కప్డా ఔర్ మకాన్, క్రాంతి లాంటి చిత్రాల్లో నటించారు. బాలీవుడ్‌లో బీర్బల్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

ఈ విషయాన్ని అతని స్నేహితుడు జుగ్ను మీడియాకు తెలిపారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు వెల్లడించారు. ఈ విషయం తెలుసకున్న సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించింది.  ఖోస్లా ముఖ్యంగా హాస్య పాత్రలకు పేరు సంపాదించుకున్నారు. 'షోలే' చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. షోలేలో ఖైదీగా అతని పాత్ర చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అతను నసీబ్, యారానా, హమ్ హై రహీ ప్యార్ కే, అంజామ్ వంటి చిత్రాలలో కూడా నటించారు. 

మరిన్ని వార్తలు