మూడు నెలల తర్వాత తొలిసారి 40 వేల దిగువకు కేసులు

29 Jun, 2021 09:58 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. తాజాగా కొత్త కేసుల సంఖ్య 40 వేలకు దిగువకు పడిపోయాయి. గడచిన 24 గంటల్లో 37,566 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. వరుసగా రెండో రోజు 1000లోపు మరణాలు సంభవించాయి. కోవిడ్‌తో నిన్న 907 మంది మృతిచెందారు. సోమవారం రోజు 56,994 మంది కోలుకున్నారు.

ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం కోవిడ్‌పై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,16,897గా ఉంది. మొత్తం 3,97,637 మంది మరణించారు. ఇప్పటి వరకు 2,93,66,601 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 5,52,659 లక్షల యాక్టీవ్‌ కేసులున్నాయి. దేశంలో 96.87 శాతం కరోనా రికవరీ రేటు ఉంది. యాక్టివ్ కేసుల శాతం 1.82 శాతం, మరణాల రేటు 1.31 శాతంగా ఉంది.

చదవండి: థర్డ్‌వేవ్‌పై ఆందోళన.. డాక్టర్లేమంటున్నారంటే..

మరిన్ని వార్తలు