Delhi Liquor Policy Case: సిసోడియా బెయిల్‌పై 30న సుప్రీం తీర్పు

29 Oct, 2023 05:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు, మనీల్యాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీశ్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 30వ తేదీన తీర్పు వెలువరించనుంది.

ఈ కేసును సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా తిహార్‌ జైలులో కస్టడీలో ఉన్నారు. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై అక్టోబర్‌ 17వ తేదీతో వాదనలు ముగిశాయి. తీర్పు సోమవారం ఉదయం వెలువడుతుందని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు