పంజాబ్‌ గవర్నర్‌ బన్వారీలాల్‌ రాజీనామా

4 Feb, 2024 06:09 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌ పరిపాలనాధికారిగా ఉన్న బన్వారీలాల్‌ పురోహిత్‌ పదవులకు రాజీనామా చేశారు. శనివారం ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచారు.

‘‘వ్యక్తిగత కారణాలతోపాటు కొన్ని ఇతర బాధ్యతలను నెరవేర్చాల్సిన దృష్ట్యా పంజాబ్‌ గవర్నర్‌ పదవితోపాటు, చండీగఢ్‌ పరిపాలనాధికారి బాధ్యతలకు రాజీనామా సమరి్పస్తున్నాను’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పంజాబ్‌ గవర్నర్, చండీగఢ్‌ పాలనాధికారిగా 2021లో బన్వారీలాల్‌ బాధ్యతలు చేపట్టారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega