రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ మేరకు ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్ట్పై గట్టిగా ఫోకస్ పెట్టింది. ఈ సారి మేనిఫెస్టోలో కుల గణనతో సహ కీలక హామీలను ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. మంగళవారం అందుకు సంబధించిన పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు ఖర్గే. కాంగ్రెస్ కంచుకోట అయిన రాజస్తాన్లో మళ్లీ తమ పార్టీ ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమగా చెప్పారు.
అలాగే తాము ఎన్నికల్లో ఇచ్చే ప్రతీ హామీని నెరవేరుస్తామని, తాము ఇవ్వగలిగే వాగ్దానాలనే పొందుపర్చమని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాల సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే కచ్చితంగా కుల గణన చేస్తామనే కీలక హామీతో ముందుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాగా, ఈ నెల 25న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
మేనిఫెస్టోలో కీలక హామీలు
Congress winning Rajasthan 🔥
— Ashish Singh (@AshishSinghKiJi) November 21, 2023
Manifesto,pic.twitter.com/HshYKEDjyM
(చదవండి: రాజస్థానీలకు కాంగ్రెస్ ఏడు గ్యారంటీలు)