ఐటీ దాడుల్లో రూ.750 కోట్ల అక్రమాస్తులు బహిర్గతం

13 Oct, 2021 06:49 IST|Sakshi

సాక్షి, బనశంకరి: బెంగళూరులో నాలుగురోజుల కిందట కాంట్రాక్టర్లు, చార్టెడ్‌ అకౌంటెంట్, తదితరుల ఇళ్లపై జరిగిన సోదాల వివరాలను ఐటీ అధికారులు మీడియాకు వెల్లడించారు. ముగ్గురు ప్రముఖ కాంట్రాక్టర్లు, 40 మంది సబ్‌ కాంట్రాక్టర్ల పేర్లతో నీటి ప్రాజెక్టుల పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు.

ఈ సోదాల్లో రూ.750 కోట్ల విలువైన అక్రమాస్తుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ మొత్తంలో రూ.487 కోట్లకు సరైన ఆధారాలు లేవని తేల్చారు. పలువురి ఇళ్లలో రూ.8.67 కోట్ల విలువైన బంగారం, రూ.29.83 కోట్ల విలువైన వెండిని సీజ్‌చేశారు. దాడి సమయంలో మొత్తం రూ.4.69 కోట్ల నగదు సీజ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు