రాజ్యసభ వైస్ చైర్మన్‌ ప్యానల్‌లో విజయసాయిరెడ్డికి చోటు

17 Jul, 2022 21:31 IST|Sakshi

ఢిల్లీ: రాజ్యసభ వైస్ చైర్మన్‌ నూతన ప్యానల్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అవకాశం దక్కింది.  తాజాగా రాజ్యసభ వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పునర్మించారు. దీనిలో భాగంగా విజయసాయిరెడ్డికి ప్యానల్‌లో చోటు లభించింది. రాజ్యసభ వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌లో విజయసాయిరెడ్డితో పాటు భువనేశ్వర్‌ కలిత, ఇందు బాలగోస్వామి, హనుమంతయ్య, తిరుచి శివ, డాక్టర్‌ సస్మిత్‌ పాత్రలకు సభ్యులుగా చోటు దక్కింది.   

మరిన్ని వార్తలు