ఢిల్లీలో భూటాన్‌ రాజుకు ఘనస్వాగతం

6 Nov, 2023 06:20 IST|Sakshi

న్యూఢిల్లీ: భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌కు ఆదివారం ఢిల్లీలో భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ విమానాశ్రయంలో ఆయనకు ఆహ్వానం పలికారు. అనంతరం ఆయనతో భేటీ అయ్యారు.

భారత్‌లో రాజు వాంగ్‌చుక్‌ ఎనిమిది రోజుల పర్యటన ఈ నెల 3న అస్సాం రాజధాని గువాహటిలో మొదలైంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు.

మరిన్ని వార్తలు