ఉమెన్స్‌ డే కానుక: గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు

8 Mar, 2024 09:10 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.100 తగ్గించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ‍ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. 

కాగా, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.100 తగ్గిస్తున్నట్టు ట్విట్టర్‌ వేదికగా మోదీ తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ‘ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది. వంట గ్యాస్‌ ధరను తగ్గించడంతో ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను అందించడానికి అనుగుణంగా ఉంటుంది’ అని వ్యాఖ్యలు చేశారు. 

Election 2024

మరిన్ని వార్తలు