ప్రతిపక్షాల అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన యశ్వంత్‌ సిన్హా

27 Jun, 2022 12:36 IST|Sakshi

Opposition's Presidential polls candidate Yashwant Sinha.. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా.. సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. విపక్ష పార్టీల నేతలతో కలిసి యశ్వంత్‌ సిన్హా.. పార‍్లమెంట్‌ కార్యదర్శికి నామినేషన్‌ పత్రాలు అందించారు. నామినేషన్‌ దాఖలుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, తదితరులు ఆయన వెంట ఉన్నారు.

ఇది కూడా చదవండి: పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసే పవర్‌ ఇవ్వండి.. న్యాయ శాఖకు ఈసీ వినతి

మరిన్ని వార్తలు