గాంధారి: గాందారి శివారులో వ్యవసాయ బోరుబా వుల వద్ద నుంచి ట్రాన్స్ఫార్మర్లు, అడవి పందులు, కోతుల నుంచి పంటలు రక్షించుకోడానికి అమర్చిన సోలార్ బ్యాటరీలను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదివారం రాత్రి గాంధారి శివారులోని చౌదరి పల్లె వ్య వసాయ బోరు బావి వద్ద నుంచి గంద్యాటం సంగయ్యకు చెందిన ట్రాన్స్ఫార్మరుతో పాటు అదే ప్రాంతంలో బ్రాహ్మణ్పల్లి గ్రామానికి చెందిన మరో రైతుకు చెందిన ట్రాన్స్ఫార్మరును ధ్వంసం చేసి అందులో నుంచి పరికరాలను ఎత్తుకెళ్లారు. గాంధారికి చెందిన రైతులు ముస్తఫా, గౌస్, మంగలి కిష్టయ్య, చిరుకూరి విఠల్ పొలాల వద్ద అమర్చుకున్న సోలార్ బ్యాటరీలను దుండగులు దొంగిలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ట్రాన్స్కో ఏఈ సతీష్ రెడ్డి తెలిపారు.
పందిమడుగులో ద్విచక్రవాహనం..
సిరికొండ: మండలంలోని పందిమడుగు గ్రామానికి చెందిన సుంకరిపల్లి సాయన్న ద్విచక్రవాహనం చోరీ అయిందని ఎస్సై నర్సింలు సోమవారం తెలిపారు. తన ఇంటి ముందు నిలిపి ఉంచిన స్కూటీ శనివారం రాత్రి చోరీకి గురైందని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.