కొనసాగుతున్న పీజీ సెమిస్టర్‌ పరీక్షలు | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 7 2023 12:44 AM

- - Sakshi

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరిగిన పీజీ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు కంట్రోలర్‌ అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఎంబీఏ, ఎంసీఏ మూడో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలో 462 మంది విద్యార్థులకు 435 మంది హాజరు కాగా 27మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలో 562 మందికి 528 పరీక్ష రాశారు. ఉదయం జరిగిన ఎల్‌ఎల్‌బీ మూడో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల్లో 36 మంది విద్యార్థులకు 24 మంది, మధ్యాహ్నం జరిగిన ఎల్‌ఎల్‌బీ ఐదో సెమిస్టరు పరీక్షలో 24 మంది 21 మంది హాజరైనట్లు వివరించారు. క్యాంపస్‌లోని కంప్యూటర్‌ సైన్స్‌ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ బి విద్యావర్ధిని, ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ ఆరతి పరిశీలించారు.

Advertisement
Advertisement