తాడికొండ: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుందని జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. శుక్రవారం తాడికొండ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆమె అందరి సమస్యలు క్షుణ్ణంగా విని పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా జేసీ రాజకుమారి మాట్లాడుతూ ప్రజల సమస్యలను మరింత వేగంగా పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని, అర్జీలు ఇచ్చిన వారి సమస్యలను 7–15 రోజుల్లోగా పరిష్కరించడమే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీందర్, బీసీ కార్పొరేషన్ ఈడీ దుర్గాభామి, సీపీవో శేషశ్రీ, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, ఆర్డబ్లుస్ ఎస్ఈ సురేష్, విభిన్న ప్రతిభావంతుల ఏడీ సువార్త, డీఎంహెచ్వో డాక్టర్ శ్రావణ్ బాబు, పశు సంవర్థక శాఖ జేడీ జేపీ వెంకటేశ్వర్లు, ఏపీఎంఐపీ మేనేజర్ వజ్రశ్రీ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ లక్ష్మీ, ఎంపీడీవో అత్తోట దీప్తి, తహసీల్థార్ జీవీఎస్ ఫణీంద్ర బాబు, డెప్యూటీ తహసీల్థార్ కాకుమాను ప్రసాద్, పలు విభాగాల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి 80 అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చేయాలని సూచించిన జేసీ