వీడియో: ఇస్కాన్‌పై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ సంచలన ఆరోపణలు

27 Sep, 2023 08:41 IST|Sakshi

ఢిల్లీ: బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్‌పై( ISKCON) సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్‌ వాళ్లు దేశంలోనే దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని.. గోశాలల నిర్వహణ పేరిట ఆవుల్ని కసాయివాళ్లకు అమ్మేసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారామె. 

ఇస్కాన్.. దేశంలోనే అతిపెద్ద మోసపూరిత సంస్థ. ఇది గోశాలలను నిర్వహణ పేరిట ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందుతోంది. అనంతపూర్‌ ఇస్కాన్‌ గోశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆవు కూడా లేదు. అన్నింటిని కసాయివాళ్లకు అమ్మేశారు. అలాంటి వాళ్లు రోడ్లపైకి చేరి హరేరామ్‌.. హరేకృష్ణ అంటూ వల్లేస్తుంటారు. పాల మీదే ఆధారపడి బతుకుతున్నాం అని చెప్పుకుంటారు అని ఆరోపించారామె. 

అయితే.. మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్‌ ఖండించింది. పశు సంరక్షణలో ఇస్కాన్‌ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఇస్కాన్‌ ప్రతినిధి యుధిష్టిర్‌ గోవిందా దాస్‌ ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. కేంద్ర మాజీ మంత్రి అయిన మేనకా గాంధీ, యానిమల్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌ కూడా అనే సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు