పవన్‌కు ప్రజలు తిరిగి అదే గతి పట్టిస్తారు: మంత్రి కారుమూరి

13 Jan, 2023 16:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పవన్‌ కల్యాణ్‌ పార్టీని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టేశాడని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. అన్ననే గెలిపించలేదని హేళన చేసిన టీడీపీతోనే కలవడానికి సిగ్గు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెప్పులతో కొడతానన్న పవన్‌కు ప్రజలు తిరిగి అదేగతి పట్టిస్తారని హెచ్చరించారు. పవన్‌ వ్యాఖ్యలను చూసి యువత అసహ్యించుకుంటున్నారు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.

చదవండి: (మీరు కలిసొచ్చినా రాజకీయంగా మరణమే: అంబటి రాంబాబు)

మరిన్ని వార్తలు