‘అవినీతిపరులూ పారిపోండి పథ​కానికి ప్రధాని కన్వీనర్‌?’

30 Mar, 2023 08:49 IST|Sakshi

న్యూఢిల్లీ: అవినీతిపరులంతా ఒక్కటవుతున్నారంటూ విపక్షాలపై ప్రధాని మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటుగా స్పందించారు. ‘అదానీ షెల్‌ కంపెనీల్లో ఎవరు రూ.20,000 కోట్లు పెట్టుబడి పెట్టారు? లలిత్‌ మోదీవా, నీరవ్‌ మోదీవా?మెహుల్‌ చోక్సీ, విజయ్‌ మాల్యా, జతిన్‌ మెహతావా? భారత్‌లో వేలకోట్టు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన ‘అవినీతిపరులూ, పారిపోండి’ పథకం సభ్యులా? ఈ కూటమికి మీరే కన్వీనర్‌గా ఉన్నారా?’’ అంటూ బుధవారం ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు