జనసేన పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తాం: సోము

26 Feb, 2023 03:35 IST|Sakshi

గంగవరం(చిత్తూరు జిల్లా): జనసేనతో పొత్తుతోనే ఎన్నికలకు వెళతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. గంగవరం మండల కేంద్రంలో శనివారం బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తరఫున సోము వీర్రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు గెలుస్తారని తెలిపారు. జనసేన పొత్తుతోనే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు 2024 ఎన్నికలకు కూడా వెళ్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు