కుప్పం నియోజకవర్గంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు

24 Aug, 2022 17:17 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొంగణపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఓ అభిమాని పార్టీ గుర్తు చూపడంతో ఆ పార్టీ నేతలపై చంద్రబాబు ఎదుటే తెలుగు తమ్ముళ్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న ప్లెక్సీలను ధ్వంసం చేశారు. టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త శ్రీనివాసులుకు తీవ్ర గాయాలయ్యాయి. 

చదవండి: (అమిత్‌ షా, జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీపై క్లారిటీ ఇచ్చిన జీవీఎల్‌)

మరిన్ని వార్తలు