ప్రచారంలో బయటపడ్డ చీకటి రాజకీయం
పెద్దాపురం: ప్రజలను మభ్యపెట్టడం, మాయ చేయడంలో తెలుగుదేశం వారు ముందుంటా రనడంలో అతిశయోక్తి లేదని నిరూపించారు పెద్దాపురం పట్టణ టీడీపీ నాయకులు. ఎన్నికల్లో ఏ పార్టీతోను తమకు పొత్తులు లేవంటూ, జనసేనతో అసలు సంబంధం లేదంటూ చెప్పిన టీడీపీ నాయకుల రంగు సోమవారం బయటప డింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలోని 10వ వార్డు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొంగర మంగరాజు వైఎస్సార్సీపీలో చేరడంతో ఆ వార్డుకు టీడీపీ అభ్యర్థి కరువయ్యారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థి సత్యభాస్కర్ విజయం ఖాయం కావడంతో టీడీపీ ఉనికిని చాటుకునేం దుకు జనసేన అభ్యర్థి బేదంపూడి సత్తిబాబుతో కలిసి సోమవారం టీడీపీ, జనసేన కండువాల తో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ఆరంభం నుంచి జనసేనతో పొత్తులేదంటున్న టీడీపీ వర్గీయులు ప్రచారం ఆఖరి రోజున పాల్పడిన దిగజారుడు రాజకీయాలను చూసి పట్టణ వాసులు ముక్కున వేలేసుకున్నారు.