టీడీపీ నేతల ఫోర్జరీ.. నామినేషన్ల తిరస్కరణ

24 Feb, 2023 17:09 IST|Sakshi

సాక్షి, నెల్లూరు/వైఎస్సార్‌: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీడీపీకి షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అడ్డంగా బుక్కయింది. అభ్యర్థుల నామినేషన్లలో మద్దతుదారుల పేరుతో టీడీపీ ఫోర్జరీ సంతకాలు చేసింది. 

కాగా, ఈ విషయంపై స్వతంత్ర అభ్యర్థులు స్పందించారు. తాము సంతకం చేయలేదని చెప్పారు. తమ సంతకాలు ఫోరర్జీ చేశారంటూ నాయకులు మీడియా ఎదుట చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నెల్లూరు, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు తిరస్కరణ గురయ్యాయి. 
 

మరిన్ని వార్తలు