టైమ్స్‌నౌ ఈటీజీ సర్వే: లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు షాక్‌ తప్పదా?

13 Dec, 2023 21:45 IST|Sakshi

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం సీట్లపై టైమ్స్‌నౌ ఈటీజీ సర్వేలో బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ తప్పదని వెల్లడైంది. మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్‌ హవా చూపొచ్చని అంచనా వేసింది సర్వే. కాంగ్రెస్‌ 8 నుంచి 10 సీట్లు కైవసం చేస్కోవచ్చని తెలిపింది. 

ఇక గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాల తరహా దెబ్బ తగలవచ్చని ఈటీజీ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్‌ఎస్‌ 3-5 సీట్లు పరిమితం కావొచ్చని, అలాగే బీజేపీ 3 నుంచి ఐదు స్థానాలు గెలవొచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్‌ మాత్రం పుంజుకుని తన స్థానాలు పెంచుకుంటుదని సర్వే తెలిపింది.

>
మరిన్ని వార్తలు