Asian Games 25m Pistol Event: శెభాష్‌ మనూ, ఇషా, రిథమ్‌.. భారత్‌కు మరో స్వర్ణం

27 Sep, 2023 09:03 IST|Sakshi

Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో భారత్‌ మరో స్వర్ణం సాధించింది. 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో ఈ పతకం దక్కింది. భారత షూటర్లు మనూ బాకర్‌, రిథం సంగ్వాన్‌, ఇషా సింగ్‌ అద్భుత ప్రదర్శనతో భారత్‌ ఖాతాలో మరో పసిడి చేర్చారు.

చాంపియన్లుగా నిలిచి దేశానికి గర్వకారణమయ్యారు. తాజా గోల్డ్‌ మెడల్‌తో 19వ ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో 16వ పతకం చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఐదు వెండి, ఏడు కాంస్యాలు ఉన్నాయి.


 

మరిన్ని వార్తలు