స్వర్ణం నెగ్గిన దినేశ్‌ కార్తీక్‌ భార్య

1 Jul, 2023 07:31 IST|Sakshi

హ్వాంగ్‌జౌ (చైనా): ఆసియా స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన దీపిక పల్లికల్‌ (క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ భార్య) – హరీందర్‌పాల్‌ సింగ్‌ సంధు జోడి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో దీపిక – హరీందర్‌ 11–10, 11–8 స్కోరుతో ఇవాన్‌ యూయెన్‌ – రాచెల్‌ ఆర్నాల్డ్‌ (మలేసియా)పై విజయం సాధించారు.

అంతకు ముందు క్వార్టర్‌ ఫైనల్లో మలేసియాకు చెందిన టాప్‌ సీడ్‌ ఆయిరా అజ్మాన్‌ – షఫీక్‌ కమాల్‌ను...సెమీ ఫైనల్లో తయ్యద్‌ అస్లామ్‌ – ఫైజా జఫర్‌ (పాకిస్తాన్‌)ను భారత ద్వయం ఓడించింది. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌ను భారత్‌ రెండు పతకాలతో ముగించింది. భారత్‌కు చెందిన అనాహట్‌ సింగ్‌ – అభయ్‌ సింగ్‌ కాంస్యం గెలుచుకున్నారు.    

మరిన్ని వార్తలు