రన్నరప్‌గా నిలిచిన భారత్‌

28 Jan, 2024 10:40 IST|Sakshi

మస్కట్‌: మహిళల హాకీ ఫైవ్స్‌ ప్రపంచకప్‌ టోర్నీలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి ఇతిమరపు రజని కెపె్టన్సీలోని భారత జట్టు 2–7 గోల్స్‌ తేడాతో నెదర్లాండ్స్‌ జట్టు చేతిలో ఓడిపోయింది.

భారత్‌ తరఫున జ్యోతి ఛత్రి (20వ ని.లో), రుతుజా (23వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించింది.

whatsapp channel

మరిన్ని వార్తలు