నేడు అమెరికాతో యువ భారత్‌ ‘ఢీ’  | Sakshi
Sakshi News home page

నేడు అమెరికాతో యువ భారత్‌ ‘ఢీ’ 

Published Sun, Jan 28 2024 3:27 AM

young India will clash with America - Sakshi

అండర్‌–19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నీలో ఉదయ్‌ సహారణ్‌ నాయకత్వంలోని టీమిండియా నేడు గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో అమెరికా జట్టుతో తలపడనుంది. తొలి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, ఐర్లాండ్‌పై గెలిచి ‘సూపర్‌ సిక్స్‌’ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత్‌ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి లీగ్‌ దశను అజేయంగా ముగించాలని పట్టుదలతో ఉంది. మధ్యాహ్నం గం. 1:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
 

Advertisement
Advertisement