ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో జయవర్ధనే, పొలాక్‌

14 Nov, 2021 05:50 IST|Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా ముగ్గురు దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు కల్పించింది. శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేల జయవర్ధనే, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ షాన్‌ పొలాక్‌లతో పాటు ఇంగ్లండ్‌ దివంగత మహిళా క్రికెటర్‌ జెనెట్టె బ్రిటిన్‌లు ఈ జాబితాలో ఉన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య నేడు జరిగే టి20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌ ఆరంభానికి ముందు వీరిని ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ జాబితాలో అధికారికంగా చేరుస్తారు. జయవర్ధనే సభ్యుడిగా ఉన్న శ్రీలంక జట్టు 2014 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. వన్డే, టెస్టు ఫార్మాట్లలో 3 వేల పరుగులు, 300 వికెట్ల చొప్పున తీసిన తొలి క్రికెటర్‌గా షాన్‌ పొలాక్‌ ఘనతకెక్కాడు. బ్రిటిన్‌ 19 ఏళ్ల (1979–1998) పాటు టెస్టుల్లో ఇంగ్లండ్‌ మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె 2017లో మరణించింది. 

మరిన్ని వార్తలు