South Asia Football Tournament: ఫైనల్లో భారత్‌ 

14 Oct, 2021 07:42 IST|Sakshi

మాలీ: దక్షిణాసియా ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరింది. టైటిల్‌ పోరుకు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సునీల్‌ ఛెత్రి బృందం 3–1తో మాల్దీవులు జట్టును ఓడించింది. లీగ్‌ దశలో టాప్‌–2లో నిలిచిన భారత్, నేపాల్‌ జట్లు శనివారం జరిగే ఫైనల్లో తలపడతాయి.    

మరిన్ని వార్తలు