#Axar Patel: వరల్డ్‌కప్‌కు మిస్సయ్యాడు.. కానీ అక్కడ మాత్రం విధ్వంసం! కేవలం 27 బంతుల్లోనే

25 Oct, 2023 10:45 IST|Sakshi
అక్షర్‌ పటేల్‌(ఫైల్‌ ఫోటో)

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌-2023కు దూరమైన సంగతి తెలిసిందే. తొలుత ప్రకటించిన ప్రిలిమనరీ జట్టులో సభ్యునిగా ఉన్న అక్షర్‌.. టోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. వరల్డ్‌కప్‌కు దూరమైన అక్షర్‌ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు.

ప్రస్తుతం జరగుతున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో గుజరాత్‌ జట్టు తరుపున అక్షర్‌ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌ అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 పరగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 234 పరుగుల భారీ లక్ష్య చేధనలో గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు మాత్రమే చేసింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. పంజాబ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ(112) సెంచరీతో చెలరేగాడు.
చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. టీమిండియాకు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు