బిగ్బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్తో బుర్ర హీటెక్కిపోయింది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడేశారు. మొన్నటివారమే బూతులు మాట్లాడాడని భోలె షావళికి నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. ఆ సంగతి కూడా మర్చిపోయి అమర్దీప్, సందీప్, గౌతమ్.. అందరూ తామేమీ తక్కువ కాదంటూ బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు. ఇక శివాజీ మాత్రం ఎప్పటిలాగే అందరిముందు మంచిగా నటించాడు.
శివాజీ ఫ్రస్టేషన్
కానీ నామినేషన్స్ అయ్యాక మాత్రం తన ఆవేశాన్నంతా బయటపెట్టాడు. సీరియల్ బ్యాచ్ మీద విషం కక్కాడు. 'దొంగలు దొంగ.. దొంగ.. అని పరిగెట్టిస్తున్నారు. జనాలు చూస్తారు. ఇప్పుడన్నా మనుషులు, ప్రజలు అనే వాళ్లుంటే ఈ వారం చూస్తా.. ఈ వారాన్ని బట్టి ఈ హౌస్లో ఉంటా.. తర్వాత ఎవరినో ఒకరిని కొట్టి నేనే స్వచ్ఛందంగా వెళ్లిపోతా. ఇక్కడున్నవాళ్లంతా ఏం చేస్తున్నారు? ఈ హౌస్ అంతా డిస్టర్బ్ అవుతుంటే ఏంటిదంతా? మరీ ఇంత అన్యాయమా? ఈ వారం తెలుస్తుంది.. ఎందుకంటే ఈ వారం పర్ఫెక్ట్గా నామినేషన్స్ పడ్డాయి.. ఇప్పుడు దేవుడు చూడాలి' అని మాట్లాడాడు.
జనాలేమీ పిచ్చోళ్లు కాదు!
హౌస్లో శివాజీ ఏం చెప్పినా ప్రిన్స్ యావర్, ప్రశాంత్ వింటారు. తను ఏం మాట్లాడినా గొర్రెల్లా తలూపుతారు. కానీ జనాల్ని కూడా మానిప్యులేట్ చేయాలనుకుంటున్నాడు శివాజీ. అదంత ఈజీ కాదు.. జనాలు ఆట తీరును చూసి ఓట్లేస్తారు, కానీ ఒకరు చెప్పగానే చేతులు కట్టుకుని దాన్ని ఫాలో అయిపోరు. పైగా ఒకరిని కొట్టేసి వెళ్లిపోతా అనడం చాలా పెద్ద మాట అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నామినేషన్స్ రచ్చతో ప్రేక్షకుల తలలు కూడా బొప్పి కట్టాయి. మరి ఈ వారం ఎవరిని పంపించేస్తారో చూడాలి!
#Shivaji 🤧🤧
— PAVAN SAI (@PAVANSAI99949) October 24, 2023
Kotese povatam enti anna 🥲#BiggBossTelugu7 pic.twitter.com/F4DOElVpd4
చదవండి: ఆ ఇద్దరికీ ఫుల్ సపోర్ట్.. కానీ అతను పూర్తిగా మారిపోయాడు.. పూజా మూర్తి