IPL 2022: ఐపీఎల్‌లో పాటిదార్‌ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా..!

27 May, 2022 21:58 IST|Sakshi
PC: IPL.com

ఐపీఎల్‌లో ఆర్సీబీ యువ ఆటగాడు రజత్‌ పాటిదార్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఒక ఐపీఎల్‌ సీజన్ ప్లే ఆఫ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డులెక్కాడు. ఐపీఎల్‌-2022 ప్లే ఆఫ్స్‌లో 170 పరుగులు చేసిన పాటిదార్‌ ఈ ఘనత సాధించాడు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 112 పరుగులు, రాజస్తాన్‌ రాయల్స్‌తో క్వాలిఫైర్ ‌2లో 58 పరుగులు పాటిదార్‌ చేశాడు. ఇక ఓవరాల్‌గా ప్లే ఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఉన్నాడు. 2016 సీజన్‌లో వార్నర్‌ 190 పరుగులు సాధించాడు. ఇక 170 పరుగలతో పాటిదార్‌ రెండో స్ధానంలో ఉన్నాడు.

చదవండి: Left Arm Pacers In IPL 2022: ఐపీఎల్ 2022లో అదరగొట్టిన లెఫ్టార్మ్ పేసర్లు వీరే..

మరిన్ని వార్తలు