Ranji Trophy 2023-24: తొలి రోజు 'ఆంధ్ర'దే..

10 Feb, 2024 07:20 IST|Sakshi

సాక్షి, విజయనగరం: ఉత్తరప్రదేశ్‌ జట్టుతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు నిలకడగా ఆడుతోంది. డాక్టర్‌ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 232 పరుగులు సాధించింది.

ఆల్‌రౌండర్‌ కేవీ శశికాంత్‌ (83 బంతుల్లో 72; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ రికీ భుయ్‌ (90 బ్యాటింగ్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. శశికాంత్‌ అవుటయ్యాక రికీ భుయ్‌తో కలిసి కరణ్‌ షిండే (45 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టును ఆదుకున్నాడు. ఐదో వికెట్‌కు రికీ భుయ్, కరణ్‌ అభేద్యంగా 116 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఉత్తరప్రదేశ్‌ బౌలర్లలో యశ్‌ దయాళ్, అంకిత్‌ రాజ్‌పుత్, అకీబ్‌ ఖాన్, సౌరభ్‌ కుమార్‌ ఒక్కో వికెట్‌ తీశారు.
చదవండిపెత్తనమంతా వాళ్లదే.. మర్యాద తప్పొద్దు! ఏంటి జడ్డూ.. నాన్న గురించి ఇలాగేనా? 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega