-
ఐపీఎల్లో నా పేరు లేకపోవటమే మంచిదైంది: సర్ఫరాజ్ తమ్ముడు
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు?!.. అయితే, అందుకు కెరీర్ను మూల్యంగా చెల్లించే పరిస్థితి రాకూడదనే జాగ్రత్తపడుతున్నానంటున్నాడు భారత యువ సంచలనం ముషీర్ ఖాన్! కాగా క్యాష్ రిచ్ లీగ్ ద్వారానే ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చి.. టీమిండియాలో పాతుకుపోయిన విషయం తెలిసిందే. టీనేజ్లోనే కోట్లు కొల్లగొట్టి స్టార్లుగా మారిపోయిన వాళ్లూ ఉన్నారు. అందుకే.. ప్రతి యువ క్రికెటర్ ఐపీఎల్లో ఆడే ఛాన్స్ కోసం తహతహలాడుతుంటారు. ముషీర్ ఖాన్ కూడా ఆ కోవకు చెందినవాడే! అయితే, అనుకున్న వెంటనే అతడికి ఛాన్స్ రాలేదు. గతేడాది వేలంలో పేరు నమోదు చేసుకున్న 19 ఏళ్ల ముషీర్పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవడంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. దీంతో నిరాశలో కూరుకుపోయాడు. అయితే, ఆ సమయంలో తండ్రి నౌషద్ ఖాన్ చెప్పిన మాటలు తనలో స్ఫూర్తి నింపాయని.. టీ20 ఫార్మాట్ గురించి పూర్తిగా అర్థం చేసుకునేందుకు తనకు మరింత సమయం దొరికిందని సంతోషంగా చెప్తున్నాడు ఈ ఏడాది ‘రంజీ’ ఫైనల్ హీరో ముషీర్ ఖాన్. నాన్న చెప్పాడు ‘‘ఐపీఎల్లో నా పేరు లేదు. అయినా.. మరేం పర్లేదు.. టెస్టు క్రికెట్పై దృష్టి పెట్టి.. టీమిండియాలో చోటే లక్ష్యంగా అడుగులు వేయాలని మా నాన్న చెప్పారు. ఆ క్రమంలో సరైన సమయంలో ఐపీఎల్లో చోటు కూడా దక్కుతుందన్నారు. ఈరోజు కాకపోతే.. రేపైనా ఐపీఎల్లో నేను తప్పక అవకాశం దక్కించుకుంటానని బలంగా చెప్పారు. నిజానికి ఈసారి నేను ఎంపిక కాకపోవడమే మంచిదైంది. టీ20 క్రికెట్ను నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి. అన్ని రకాలుగా పొట్టి ఫార్మాట్ కోసం సిద్ధం కావాలి’’ అని ముషీర్ ఖాన్ పీటీఐతో చెప్పుకొచ్చాడు. మా అన్నయ్యే నాకు స్ఫూర్తి ఇక తన అన్న సర్ఫరాజ్ ఖాన్ గురించి మాట్లాడుతూ..‘‘ ఆట పట్ల మా అన్నయ్యకు ఉన్న అంకిత భావం, అతడి బ్యాటింగ్ శైలి నాకెంతో నచ్చుతాయి. మా ఇద్దరి బ్యాటింగ్ శైలి దాదాపుగా ఒకేలా ఉంటుంది. రంజీ ఫైనల్ మ్యాచ్కు వెళ్లే ముందు అతడే నాలో ధైర్యం నింపాడు. ఫైనల్ అని ఒత్తిడిలో కూరుకుపోతే మొదటికే మోసం వస్తుందని.. సాధారణ మ్యాచ్లలాగే అక్కడా ఆడాలని చెప్పాడు’’ అని ముషీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ 2023-24 ఫైనల్లో ముషీర్ ఖాన్ 136 పరుగుల(సెకండ్ ఇన్నింగ్స్)తో చెలరేగి జట్టును విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ముంబై రికార్డు స్థాయిలో 42వ సారి టైటిల్ గెలవడంలో భాగమై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అనంతరం ముషీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సర్ఫరాజ్కూ నో ఛాన్స్ కాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా రాజ్కోట్ మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్. అండర్-19 వరల్డ్కప్లో సత్తా చాటి.. రంజీలోనూ అదరగొట్టాడు. ఇప్పటి వరకు అతడు కేవలం ఐదు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్ను సైతం ఐపీఎల్-2024 వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. అంతకు ముందు అతడు ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై -
BCCI: శ్రేయస్ అయ్యర్కు శుభవార్త!?
ఐపీఎల్-2023 నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ అభిమానులకు శుభవార్త! ఆ జట్టు కెప్టెన్, టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్గా ఉన్నట్లు సమాచారం. రెండు రోజుల వ్యవధిలో అతడు కేకేఆర్ ప్రి- ఐపీఎల్ క్యాంపులో చేరనున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్ విజేత ముంబై జట్టు మేనేజర్ భూషణ్ పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు క్రిక్బజ్ పేర్కొంది. కాగా రంజీ తాజా సీజన్ ఆరంభం నుంచి ముగింపు మధ్యలో శ్రేయస్ అయ్యర్ కెరీర్లో సంచలన మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు ముంబై తరఫున రంజీ బరిలో దిగిన అయ్యర్.. ఆ తర్వాత టీమిండియాతో చేరాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండు టెస్టుల్లో విఫలం కావడంతో బీసీసీఐ అతడిని పక్కనపెట్టింది. ఈ క్రమంలో వెన్నునొప్పితో బాధపడుతున్న అతడు.. జాతీయ క్రికెట్ అకాడమీలో చేరాడు. అయితే, అప్పటికే బీసీసీఐ.. సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లను ఉద్దేశించి ఓ నిబంధన ప్రవేశపెట్టింది. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు.. పూర్తి ఫిట్గా ప్రతీ ఆటగాడు రంజీల్లో ఆడాలని ఆదేశించింది. దీంతో తాను ఫిట్గా లేనంటూ అయ్యర్ ముంబై క్రికెట్ అసోసియేషన్కు తెలియజేయగా.. ఎన్సీఏ అతడు పూర్తి ఫిట్గా ఉన్నట్లు చెప్పడంతో అతడిపై వేటు పడింది. క్రమశిక్షణరాహిత్యం నేపథ్యంలో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్తో పాటు శ్రేయస్ అయ్యర్ కాంట్రాక్టును కూడా బీసీసీఐ రద్దు చేసింది. ఈ క్రమంలో మళ్లీ రంజీ టోర్నీలో అడుగుపెట్టిన అయ్యర్.. విదర్భతో ఫైనల్ మ్యాచ్లో అదరగొట్టాడు. 95 పరుగులతో అదరగొట్టి ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, బ్యాటింగ్ అనంతరం రెండురోజుల పాటు అయ్యర్ ఫీల్డింగ్కు దూరంగా ఉండటంతో వెన్నునొప్పి తిరగబెట్టిందనే వార్తలు వచ్చాయి. ఫలితంగా అతడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ముంబై జట్టు మేనేజర్ భూషణ్ పాటిల్ మాట్లాడుతూ.. ‘‘అయ్యర్ ఫిట్నెస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతడు బాగున్నాడు. రెండు రోజుల్లో ప్రి- ఐపీఎల్ క్యాంపులో చేరతాడు’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. అయ్యర్ కాంట్రాక్టు విషయంలో బీసీసీఐ పునరాలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టును పునరుద్ధరించే యోచనలో ఉన్నట్లు వదంతులు వస్తున్నాయి. చదవండి: హార్దిక్ రిటైర్ అవ్వటమే బెటర్: భారత మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్ -
‘రంజీ’ రారాజు ముంబై... ఆటగాళ్లపై కోట్లాభిషేకం
విదర్భ ఇన్నింగ్స్లో 135వ ఓవర్... అప్పటికే 9 వికెట్లు పడ్డాయి... కెరీర్లో చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న ముంబై పేసర్ ధవల్ కులకర్ణి ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్లో 8 ఓవర్లే వేశాడు... ఒక్కసారిగా ధవల్ చేతికి కెప్టెన్ రహానే బంతిని అందించాడు... మూడో బంతికి ఉమేశ్ యాదవ్ క్లీన్బౌల్డ్... ముంబై శిబిరంలో సంబరాలు షురూ... వెరసి దేశవాళీ క్రికెట్ దిగ్గజం ఖాతాలో మరో రంజీ ట్రోఫీ చేరింది. ముంబై జట్టు ఏకంగా 42వ సారి రంజీ టైటిల్ను సొంతం చేసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత టీమ్ ఖాతాలో మరో కప్ చేరగా... ధవల్ ఐదో రంజీ విజయంలో భాగంగా నిలిచి సగర్వంగా ఆటకు వీడ్కోలు పలికాడు. ముంబై: భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీని ముంబై జట్టు సొంతం చేసుకుంది. గురువారం ముగిసిన ఐదు రోజుల ఫైనల్లో ముంబై 169 పరుగుల తేడాతో రెండుసార్లు చాంపియన్ విదర్భపై ఘన విజయం సాధించింది. విదర్భ చివరి రోజు వరకు పోరాడినా అసాధ్యమైన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. 538 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 248/5తో ఆట కొనసాగించిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (199 బంతుల్లో 102; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకోగా... హర్‡్ష దూబే (128 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు ఆరో వికెట్కు 130 పరుగులు జోడించారు. అక్షయ్, హర్‡్ష చాలాసేపు ముంబై బౌలర్లకు లొంగకుండా ఇబ్బంది పెట్టారు. అయితే ఎట్టకేలకు తనుష్ బౌలింగ్లో అక్షయ్ వికెట్ల ముందు దొరికిపోవడంతో ముంబై గెలుపు బాట పట్టింది. మిగిలిన నాలుగు వికెట్లను 15 పరుగుల వ్యవధిలోనే తీసి ముంబై చాంపియన్గా అవతరించింది. సెంచరీ సాధించడంతో పాటు 2 వికెట్లు తీసిన ముషీర్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతనికి రూ. 50 వేలు ప్రైజ్మనీ దక్కింది. టోర్నీ మొత్తంలో 502 పరుగులు, 29 వికెట్లతో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన ముంబై ఆటగాడు తనుష్ కొటియన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. తనుష్ కు రూ. 2 లక్షల 50 వేలు ప్రైజ్మనీ లభించింది. 1934–35 సీజన్లో తొలిసారి విజేతగా నిలిచిన ముంబై (బాంబే) జట్టు ఈ టైటిల్కు ముందు 2015–16 సీజన్లో చివరిసారి ట్రోఫీని అందుకుంది. ఆటగాళ్లపై కోట్లాభిషేకం... ప్రైజ్మనీలో ముంబై డబుల్ ధమాకా కొట్టింది. సీజన్ విజేతకు బీసీసీఐ రూ. 5 కోట్ల ప్రైజ్మనీ ఇవ్వగా... ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) తమ క్రికెటర్లకు ప్రత్యేకంగా రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది. దీంతో తాజా రంజీ విజేతకు వచ్చిన ప్రైజ్మనీ రెట్టింపైంది. ‘ఈ సీజన్లో మా జట్లు బాగా ఆడాయి. బీసీసీఐ నిర్వహించిన వయో విభాగాల టోర్నీలన్నింటిలోనూ ఫైనల్ చేరాయి. దీంతో ఎంసీఏ ప్రోత్సాహకంగా రూ. 5 కోట్ల బహుమతి ఇస్తోంది’ అని కార్యదర్శి అజింక్య నాయక్ తెలిపారు. -
మా జట్టులో తక్కువ పరుగులు చేసింది నేనే: రహానే
Ajinkya Rahane Comments After Guiding Mumbai to Ranji Trophy Title Win: ‘‘మా జట్టులో తక్కువ పరుగులు స్కోరు చేసిన బ్యాటర్ను నేనే.. అయినప్పటికీ అందరికంటే అత్యంత సంతోషడే వ్యక్తిని కూడా నేనే.. ట్రోఫీ గెలవడం ఆనందంగా ఉంది. ప్రతి ఆటగాడి కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉంటాయి. ఏదేమైనా డ్రెసింగ్ రూంలో అందరూ పరస్పరం ఒకరి విజయాలు మరొకరు సెలబ్రేట్ చేసుకునే వాతావరణం కల్పించడమే అత్యంత ముఖ్యమైనది. నా జీవితంలో ఈరోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గతేడాది ఒక్క పరుగు తేడాతో ఓడి.. నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయాం. అయితే, ఇప్పుడు జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి పట్ల మరింత బాధ్యత తీసుకుని.. వారి ఆటిట్యూడ్, ఫిట్నెస్, సహచర సభ్యులతో మెలిగే విధానం.. ఇలా ప్రతి అంశంలోనూ మరింత శ్రద్ధ వహించాం. ముంబై క్రికెట్ అసోసియేషన్ అన్ని వేళలా మాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు’’ అని రంజీ ట్రోఫీ 2023-24 టైటిల్ విన్నింగ్ కెప్టెన్ అజింక్య రహానే హర్షం చేశాడు. అదే విధంగా.. విదర్భ సైతం ఆఖరి వరకు విజయం కోసం అద్భుతంగా పోరాడిందని కొనియాడాడు. కాగా వాంఖడే స్టేడియంలో గురువారం ముగిసిన రంజీ ట్రోఫీ 2023- 24 ఫైనల్ మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విదర్భను 169 పరుగుల తేడాతో చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఏకంగా 42వ సారి ట్రోఫీ గెలుచుకుంది. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్(136) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక రహానే 73 విలువైన పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ 95 పరుగులతో అదరగొట్టాడు. షమ్స్ ములానీ సైతం అజేయ అర్ధ శతకంతో రాణించాడు. కాగా రంజీ తాజా ఎడిషన్లో అదరగొట్టి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలనుకున్న రహానే.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మొత్తంగా పదమూడు ఇన్నింగ్స్ ఆడి కేవలం 214 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 are WINNERS of the #RanjiTrophy 2023-24! 🙌 Mumbai Captain Ajinkya Rahane receives the coveted Trophy 🏆 from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#Final | #MUMvVID | @ShelarAshish | @ajinkyarahane88 | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/LPZTZW3IV4 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 For his superb hundred in the #RanjiTrophy #Final, Musheer Khan is named the Player of the Match. 👍 👍 He receives the award from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#MUMvVID | @ShelarAshish | @IDFCFIRSTBank pic.twitter.com/T3l6mLW6kP — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 Tanush Kotian bagged the Player of the Tournament award for brilliant all-round display 🙌 🙌 He receives the award from Mr Ajinkya Naik, Honorary Secretary, Mumbai Cricket Association. 👏 👏#RanjiTrophy | #Final | #MUMvVID | @ajinkyasnaik | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/eMbRcr4s24 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. స్పందించిన రోహిత్
టీమిండియా వెటరన్, ముంబై స్టార్ పేసర్ ధవల్ కులకర్ణి తన ఫస్ట్క్లాస్ కెరీర్ను ఘనంగా ముగించాడు. రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా విధర్బతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఫస్ట్క్లాస్ క్రికెట్ నుంచి కులకర్ణి తప్పుకున్నాడు. ఈ ఫైనల్ పోరులో విధర్బను 164 పరుగుల తేడాతో చిత్తు చేసిన ముంబై.. 42వ సారి రంజీ ట్రోఫీ టైటిల్ను ముద్దాడింది. తన కెరీర్ చివర మ్యాచ్లో కూడా కులకర్ణి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొత్తంగా రెండు ఇన్నింగ్స్లు కలిపి ధవల్ 4 వికెట్లు పడగొట్టాడు. కాగా సెకెండ్ ఇన్నింగ్స్లో విధర్బ చివరి వికెట్ను కూడా కులకర్ణినే పడగొట్టడం గమనార్హం. ఉమేశ్ యాదవ్ను క్లీన్ బౌల్డ్ చేసి ముంబైని ఛాంపియన్స్గా కులకర్ణి నిలిపాడు. ముంబై తరపున 96 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన కులకర్ణి.. 281 వికెట్లు పడగొట్టాడు. ఇక 2016లో ధోని సారథ్యంలో టీమిండియా తరపున కులకర్ణి అరంగేట్రం చేశాడు. అతడికి ధోని నుంచి మంచి సపోర్ట్ కూడా ఉండేది. కానీ తర్వాత కులకర్ణి విఫలం అవ్వడంతో జట్టులో చోటు కోల్పోయాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ధవల్ కులకర్ణి మంచి స్నేహితుడు. ఇద్దరూ కలిసి చాలా కాలం పాటు ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడారు. వీరిద్దరూ మంబైకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తరపున ధవల్ పలు ఐపీఎల్ సీజన్లు ఆడాడు. ఈ క్రమంలో కులకర్ణి రిటైర్మెంట్పై హిట్మ్యాన్ స్పందించాడు. "ది వారియర్ ఆఫ్ ముంబై, వెల్డన్, వాట్ ఏ కెరీర్" అంటూ రోహిత తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement