CWC 2023: మహ్మద్‌ సిరాజ్‌ను కలిసిన నిర్మలా సీతారామన్‌..

20 Nov, 2023 20:26 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో ఓటమి అనంతరం టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్ విమానాశ్రయంలో సిరాజ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కలిశారు. ఈ సందర్భంగా టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టును సీతారామన్‌ అభినందించారు.

అదే విధంగా  ఆటలో గెలుపు ఓటములు సహజమని సిరాజ్‌ను ఓదార్చారు. కాగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్‌ పోరులో టీమిండియా 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో గత 12 ఏళ్ల నుంచి ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
చదవండి: CWC Final: వరల్డ్‌కప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమి.. షాహీన్‌ షా అఫ్రిది పోస్ట్‌ వైరల్‌

మరిన్ని వార్తలు