ఎన్నికలకు సన్నద్ధం కావాలి

11 Nov, 2023 00:56 IST|Sakshi
కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల పరిశీలకురాలు మైథిలి, కలెక్టర్‌

తిరువళ్లూరు: పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల సంఘం పరిశీలకురాలు మైథిలి ఆదేశించారు. తిరువళ్లూరు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష, వేపంబట్టులోని కౌంటింగ్‌ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు మైథిలి, కలెక్టర్‌ డాక్టర్‌ ప్రభుశంకర్‌ పరిశీలించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్నికల జాబితాను ఇప్పటికే ప్రజల కోసం సిద్ధంగా ఉంచామని, సవరణలు, మార్పులు, చేర్పులకు సైతం సిద్ధంగా వుంటామన్నారు. పోలింగ్‌ కేంద్రాల విషయంలో మార్పులకు సైతం దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. కాగా జాబితా తయారీతో పాటు వేర్వేరు అంశాల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామన్నారు. తహసీల్దార్‌ సోమసుందరం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు