తిరువళ్లూరు: కొత్తగా వేర్వేరు పదవులకు ఎన్నికై న నేతలు కాంగ్రెస్ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని తిరువళ్లూరు ఎంపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయకుమార్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ సమావేశాన్ని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. నూతనంగా వేర్వేరు పదవులకు ఎన్నికై న నేతలను కార్యకర్తలకు పరిచయం చేసే కార్యక్రమం శుక్రవారం ఉదయం టీఆర్ఎస్ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే దురైచంద్రశేఖర్ అధ్యక్షత వహించగా ఎంపీ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయకుమార్ హాజరై నూతనంగా ఎన్నికై న వారిని కార్యకర్తలకు పరిచయం చేశారు. జయకుమార్ మాట్లాడుతూ నూతనంగా పార్టీ పదవులకు ఎన్నికై న నేతలు, కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి కచ్చితంగా గుర్తింపునిస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు. పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.