బంగారుగుడిలో.. దీపారాధన

15 Nov, 2023 01:46 IST|Sakshi
బంగారు గుడిలో నక్షత్ర ఆకారంలో వెలిగించిన 10,008 దీపాలు

వేలూరు: వేలూరు శ్రీపురం బంగారుగుడిలో ప్రపంచ శాంతి కోసం 10,008 దీపాల పూజ సోమవారం రాత్రి కనులపండువగా జరిగింది. దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం దీపారాధన పూజలను శ్రీనారాయణి పీఠాధిపతి శక్తిఅమ్మ అధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా బంగారుగుడిలో నక్షత్ర ఆకారంలో 10,008 నేతి దీపాలను వెలిగించారు. ముందుగా శ్రీనారాయణి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ, గోపూజ, తులసి పూజ, యాగపూజ, ఆశ్వపూజలు అతి వైభవంగా జరిగింది. అనంతరం నారాయణి అమ్మవారికి ఊంజల్‌ సేవను శక్తిఅమ్మ చేతుల మీదుగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పీఠాధిపతి శక్తిఅమ్మ నక్షత్ర ఆకారంలో వెలిగించిన దీపాల వద్దకు వెళ్లి ప్రత్యేక యాగం చేశా రు. ప్రపంచంలో దీవావళి పండుగ రోజున ఎటువంటి అలజడి, ప్రమాదాలు జరకుండా కాపాడాలని, ప్రజలను సుఖ సంతోషాలతో వుంచాలని యాగ పూజలు నిర్వహించారు. బంగారుగుడి మేనేజర్‌ సంపత్‌, నారాయణి ఆసుపత్రి డైరెక్టర్‌ బాలాజి, శక్తి అమ్మ భక్తులు అఽధిక సంఖ్యలో పాల్గొని శక్తి అమ్మకు పుష్పాలు సమర్పించి స్వామి వారి ఆశీర్వాదం అందుకున్నారు.

మరిన్ని వార్తలు