బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్
సాక్షి, హైదరాబాద్: మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవడంతో పాటు వాటి సంరక్షణపై దృష్టి పెట్టాలని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్ 5.0’లో భాగంగా ఆయనతో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో సల్మాన్ ఖాన్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు, వరదలు, విపత్తుల మూలంగా దేశంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల జరిగే అనర్థాలను అడ్డుకునేందుకు మొక్కలు నాటడమే మార్గమని అభిప్రాయపడ్డారు. సల్మాన్ఖాన్ మొక్కలు నాటడం వల్ల కోట్లాది మంది అభిమానులు స్ఫూర్తి పొందుతారని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.