CM KCR: మంత్రి గంగులను పరామర్శించిన సీఎం కేసీఆర్‌

16 Jan, 2023 12:43 IST|Sakshi

సాక్షి, కరీంనగర్: బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం పరామర్శించారు. గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య ఇటీవల మరణించగా నేడు కరీంనగర్‌లో ద్వాదశ దిన కర్మ కార్యక్రమం నిర్వహించారు.

గంగుల మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మంత్రి గంగులను, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ఓదార్పునందించారు.

మరిన్ని వార్తలు