తెలంగాణ హైకోర్టుకు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌

6 Oct, 2021 02:29 IST|Sakshi
జస్టిస్‌ రామచంద్రరావు- జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌

పంజాబ్‌ హరియాణా హైకోర్టుకు జస్టిస్‌ శ్రీ రామచంద్రరావు

15 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ

ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 మంది న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్‌ 16న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. తెలంగాణ ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రామచంద్రరావును పంజాబ్‌ హరియాణా హైకోర్టుకు బదిలీ చేశారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అలాగే పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాను, అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిని ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  

మరిన్ని వార్తలు