హిట్లర్ బతికుంటే కేసీఆర్‌ను చూసి ఏడ్చేవాడు: కోమటిరెడ్డి

8 Aug, 2021 15:26 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

హైదరాబాద్‌: మూసీ నదిని తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. మూసి ప్రక్షాళన కోసం పార్లమెంట్‌లో మాట్లాడుతానని ఆయన అన్నారు.  హిట్లర్ బతికుంటే కేసీఆర్‌ను చూసి ఏడ్చేవాడని కోమటిరెడ్డి విమర్షించారు. సీఎం కేసీఆర్ వాసలమర్రికి రెండు సార్లు వస్తే.. ఎంపీగా నాకు సమాచారం ఇవ్వలేదన్నారు.

ఈ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రోటోకాల్ ఇవ్వరని దుయ్య బట్టారు. దళిత బంధు పెట్టిన రోజే కేసీఆర్ ఓడినట్లన్నారు. దళితులకు కేబినెట్‌లో స్థానం లేదు గాని.. దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కేసీఆర్‌కు తెలుసని విమర్షించారు. 

మరిన్ని వార్తలు