ప్రభుత్వం సాధించిన విజయాలకు అక్షర చిహ్నం 

2 Oct, 2023 04:02 IST|Sakshi
తెలంగాణ మోడల్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కేటీఆర్‌. చిత్రంలో గౌరీశంకర్, దేశపతి, దిలీప్‌ తదితరులు

‘తెలంగాణ మోడల్‌’ పుస్తకావిష్కరణలో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయప­రంపరకు అక్షరచిహ్నంగా ‘తెలంగాణ మోడల్‌’ పుస్తకం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ సంపాదకత్వంలో వెలువడిన ’తెలంగాణ మోడల్‌‘’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ దార్శనిక ఆలోచనలతో ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఎలా నమూనా అయ్యాయో ఈ పుస్తకంలో గౌరీశంకర్‌ పొందుపరిచా­రని చెప్పారు.

విజయాలను నమోదు చేయడం అంటే చరిత్రలో తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలు భద్రపరచడమేనని, ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే ఈ విజయాలు పుస్తకరూపంలో రావడం భవిష్యత్‌తరాల­కు పాఠాలుగా నిలుస్తాయన్నారు. ‘టుడే ఏ రీడర్‌– టుమారో ఏ లీడర్‌’ అంటారని గుర్తు చేశా­రు. శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్, రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.  

ఎర్రోజు శ్రీనివాస్‌  ‘నడక’ పుస్తకావిష్కరణ 
తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎ­ర్రోజు శ్రీనివాస్‌ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసా­ల­న్నీ కలిపి తీసుకొచ్చిన ’నడక’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్‌ ఆదివారం ఆవిష్కరించారు. ఈ వ్యాసాల ద్వా­రా దశాబ్దాల కాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని విశ్లేషించిన తీరును కేటీఆర్‌ అభినందించారు.

మరిన్ని వార్తలు