నేటి అర్ధరాత్రి వరకు మద్యం

31 Dec, 2023 13:46 IST|Sakshi

హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 31వ తేదీ అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చూసి ఉంటాయని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. 

ఇక బార్లు, క్లబ్బులు, పర్మిషన్‌తో జరిగే ఈవెంట్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది.  నూతన సంవత్సరానికి వీడుకోలు పలికే డిసెంబర్‌ 31 వేడుకలను పురస్కరించుకొని పలు ఆంక్షలు, మార్గదర్శకాలను జారీచేశారు. పోలీసులు నేటి రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులకు సిద్దం కాగా.. తాగి వాహనాలు నడిపితే బండిని సీజ్ చేయటంతో పాటు రూ. 10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు