TS: పలు కార్పొరేషన్‌ ఛైర్మన్ల నియామకాలు రద్దు

10 Dec, 2023 19:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. మొత్తం 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

డిసెంబరు 7న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరగా, తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఏడుగురు అధికారులను సలహా దారులుగా నియమించగా, నియమితులైన సోమేశ్‌కుమార్‌, చెన్నమనేని రమేష్‌, రాజీవ్‌ శర్మ, అనురాగ్‌ శర్మ, ఏకే ఖాన్‌, జీఆర్‌ రెడ్డి, ఆర్‌.శోభ నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది.

>
మరిన్ని వార్తలు