ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ భేటీ

1 Aug, 2020 14:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ విభృంభణ కొనసాగుతున్న తరుణంలో ఈనెల 5న తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగనుంది. కరోనా నియంత్రణ, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు, వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులను కేబినెట్‌ చర్చించనుంది. అలాగే కొత్త సచివాలయం నిర్మాణం, నియంత్రిత సాగు వంటి అంశాలు మంత్రిమండలి ముందుకు చర్చకు రానున్నాయి.

మరిన్ని వార్తలు